217 జి.ఓ పేపర్ ను చింపేసిన జనసేనాని..

మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మొదటగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులను, వేదిక ముందు ఉన్న జనసైనికులను కొనియాడారు.

అనంతరం మత్స్యకారుల సమస్యల మీద మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న 217 జి.ఓ పేపర్ ను చింపేసారు. చింపినందుకు గాను అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అంటూ సవాలు విసిరారు. ప్రభుత్వం 217 జి.ఓ ను తీసుకొస్తే చేతులు కట్టుకుని కూర్చోము అన్నారు, ఈ సమయంలో జనసేన పార్టీ తరపున 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ఈ జి.ఓ విడుదలయ్యేది కాదు అన్నారు. మత్స్యకారుల తరపున బలంగా నిలబడుతున్న బొమ్మిడి నాయకర్ ను పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు.