వర్ధ లక్ష్మయ్యను పరామర్శించిన జాగరపు కళ్యాణ్ కుమార్

అరకు: జి.కె వీధి మండలం, ధారకొండ పంచాయితీలోని ములసల వీధి గ్రామానికి చెందిన వర్ధ లక్ష్మయ్య అనారోగ్యంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ పెదబయలు మండల యువ నాయకులు జాగరపు కళ్యాణ్ కుమార్ ప్రభుత్వ హాస్పటల్ కు చేరుకొని వారి యొక్క అనారోగ్యం పట్ల వివరాలు అడిగి తెలుసుకుని వైద్య అధికారులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా చూడాలని కోరడమైనది. మరియు మీకు ఎలాంటి అవసరం వచ్చినా నన్ను సంప్రదించాలని కోరడమైనది. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని దైర్యం చెప్పడం జరిగింది.