టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన అన్నదాసు

గుంటూరు, ఎన్నారై జనసైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలోని టీం పిడికిలి వారు రూపొందించి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేయటానికి పంపిన గోడ ప్రతులు(వాల్ పోస్టర్లు), ఆటో స్టిక్కర్లు మంగళవారం గుంటూరు నగరంలో జనసేన నాయకుడు అన్నదాసు వెంకట సుబ్బారావు ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున విరాళం అందిస్తున్న జనసేనాని ఔదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఈ పోస్టర్లు, స్టిక్కర్లు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి విదేశాల్లో ఉండి సైతం మాతృభూమికి సేవ చేస్తున్న టీం పిడికిలి ఫౌండర్ రాజా మైలవరపు లాంటి ఎన్నారై జనసైనికుల సేవలు వెలకట్టలేనివని సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల కేశవ, దళవాయి భార్గవ్, యక్కటి సాయి భార్గవ్, యడ్ల వెంకటేశ్వరరావు, టీమ్ పిడికిలి సభ్యులు పాల్గొన్నారు.