జనం కోసం జనసేన 499వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 499వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం. నేటివరకు మొత్తంగా 73700 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, సైతన శ్రీను, పుగమళ్ళ పెద్దకాపు, సిరిమళ్ల రాంబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజు లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అడపా వీరబాబు కుటుంబ సభ్యులకు, నకిరెడ్డి గోవిందు కుటుంబ సభ్యులకు, కేసిబోయిన వీరబాబు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.