కష్టపడే ప్రతీ జనసైనికుడికి జనసేనలో గుర్తింపు ఉంటుంది: నాగబాబు

  • జనసేనను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లండి
  • పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు మొదలైంది
  • జనసేనతోనే రాష్ట్రానికి మంచిరోజులు

హైదరాబాద్, జనసేన పార్టీలో కష్టపడే ప్రతీ జనసైనికుడికి జనసేన పార్టీలో, అధినేత పవన్ కళ్యాణ్ హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు నాగబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి జిల్లాలో పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలను, ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలను నాగబాబుకి వివరించారు. ఈ మధ్య కార్పొరేటర్ వేధింపులకు ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికురాలు కనపర్తి విమల ఉదంతాన్ని రెల్లి యువ నాయకులు సోమి ఉదయ్ నాగబాబు దృష్టికి తీసుకువచ్చారు. జనసేన పోరాటంతోనే విమలకు ఉద్యోగంతో పాటూ నష్టపరిహారం కూడా ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ సమాజంలో పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు మొదలైందన్నారు. ప్రజా పోరాటాలతోనే ప్రజలకు చేరువ అవుతామన్నారు. ప్రజల్లో జనసేన పట్ల ఆలోచన మొదలైందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతీ జనసైనికుడు ఒక యుద్ధ ట్యాంక్ లా మారి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు. ఎర్రబాలెం మండల అధ్యక్షుడు ఎర్రగోపు నాగరాజు అమరావతి రాజధాని రైతుల సమస్యలను నాగబాబుకి వివరించారు. నాగబాబుని కలిసిన వారిలో రెల్లి రాష్ట్ర నాయకులు కోన దుర్గ, యాట్ల దుర్గాప్రసాద్, సోమరౌతు బ్రహ్మం, సుధీర్, వై నాగరాజు, దన్నాన ప్రసాద్ తదితరులున్నారు.