50 మంది అంబేద్కర్ యూత్ జనసేన పార్టీలో చేరిక

రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం నల్లగొండ, సింగవరం గ్రామాలకు చెందిన అంబేద్కర్ యూత్ సుమారు 50 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.