ఎకరానికి 50వేలు నష్టపరిహారం అందచేయాలి: అక్కల రామ్మోహన్ రావు

మైలవరం, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావుతో కలిసి తుఫాన్ వచ్చి నష్టపోయిన రైతులను పరామర్శించి తడిచిన ధాన్యాన్ని పరిశీలింంచడం జరిగింది. వారికి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం ఇస్తామని కానీ వచ్చి వారి పొలాలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వెయ్యడం కానీ చెయ్యకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికయినా ప్రభుత్వం వారిబాదలను అర్ధం చేసుకొని ఎకరానికి 50వేలు నష్టపరిహారం అందచేసి రైతుల కన్నీరు తుడవ వలసిందిగా జనసేన పార్టీ కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో సి.హెచ్.సురేష్, వై నాని, ఆర్.నాని, ఎస్.సుజాత, రామాంజనేయులు, గోపి, రాధా, రైతులు తదితరులు పాల్గొన్నారు.