జనంకోసం జనసేన 507వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 507వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 75200 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, కాండ్రేగుల గ్రామం నుంచి కర్నాకుల మాణిక్యం, కర్నాకుల దుర్గాప్రసాద్, యాళ్ళ అప్పారావు, సూరాబత్తుల సిమ్మయ్య, సూరాబత్తుల చందు, కర్నాకుల అయ్యప్పస్వామి, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మోటేపల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.