సర్వేపల్లిలో 5వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, గోవిందరాజుపురం గ్రామం నందు 5వ రోజు ఆదివారం జనంకోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ కి ఏడాదికి 2 వేల కోట్లు ఇస్తానన్న నిధులను ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాపులని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని ఎన్నికల తర్వాత కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకపోగా శ్వేత పత్రాన్ని విడుదల చేయమని మా అధినేత పవన్ కళ్యాణ్ అడిగితే కనీసం దాని గురించి స్పందన లేనటువంటి పరిస్థితి. ఇకనైనా కాపులు అందరు కూడా ఏకపక్షంగా నిలబడి జనసేన పార్టీకి అండగా ఉండి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. జనసేన గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్, వెంకయ్య, శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, శ్రీహరి, రహీం, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.