డుంబ్రిగుడా మండలంలో జనసేనపార్టీలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగుడా మండలం గసభ పంచాయితీ యువత జనసేనపార్టీలో ఆదివారం 20 మంది యువకులు పార్టీలో చేరారు అంజోడా సిల్క్ పారంలో జనసేనపార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది. డుంబ్రిగుడా మండలాధ్యక్షుడు కొన్నేడి చిన్నారావు అద్వర్యంలో మరియు అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల కొన్నేడి లక్ష్మణ్ రావు మాదాల శ్రీరాములు ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి ముత్తెమ్ ప్రసాద్ సోబోయి రాజు సంతోష్ సింగ్ సమక్షంలో జనసేనపార్టీలో చేరారు. జనసేనపార్టీ అధినేత ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి యువత జనసేనపార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మానభంగాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అందుకే గిరిజన పల్లెల్లో నుంచి యువత భారీగా జనసేనపార్టీలో చేరికలకు మొగ్గుచూపుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ క్షత్రస్థాయిలో పార్టీ బలోపేతంలో భాగంగా భారీగా చేరికలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వైసిపి మరియు టిడిపి కార్యకర్తలు భారీగా పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గసభ పంచాయితీ నుండి వంతల బాలాజీ పాంగి సోమేశ్ కుమార్ పాంగి పవన్ కుమార్ ప్రశాంత్. లొలిత్ సుబ్బారావు, సంజయ్ బుజ్జి బాబు తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.