కళ్యాణదుర్గంలో ఇంటింటా జనసేన 5వ రోజు

కళ్యాణదుర్గం: ఇంటింటా జనసేన 5వ రోజు కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం మండలం, పులికల్లు గ్రామం నందు బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసం అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలు తెలుసుకుని, జనసేన పార్టీ ఆవశ్యకతను క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కురుబ ముక్కణ్ణ మరియు ముదిగల్లు ఉదయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. ప్రజలలో మార్పు వచ్చిందని విషయం ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది ఈ విషయంపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేసారు.