జనం కోసం జనసేన మహాయజ్ఞం 670వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 670వ రోజు కార్యక్రమం సోమవారం గండేపల్లి మండలం కె.గోపాలపురం మరియు ఎన్.టి రాజాపురం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 671వ రోజు కార్యక్రమం మంగళవారం గండేపల్లి మండలం, సింగరంపాలెం మరియు గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, జగ్గంపేట మండల ప్రధానకార్యదర్శి గండికోట వీరపాండు, కె.గోపాలపురం నుండి కర్రి కృష్ణ, బొబ్బర కృష్ణార్జున, బొబ్బర మహాలక్ష్మి కుమార్, జనపరెడ్డి శ్రీను, కర్రి రామకృష్ణ, పాతాళ రామారావు, అరిగే వీరబాబు, ఎన్.టి రాజాపురం నుండి పిల్లి రాజు, వడిసల శివ, కాటయ్య, సింగరంపాలెం నుండి కుక్కల సురేష్, రాండి మనీష్, రాండి రాజు, సంకుమళ్ళ చిన్నబాబు, తిరుమలాయపాలెం నుండి గ్రామ అధ్యక్షులు యర్రా శివరామకృష్ణ, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కొండాడ భద్రం, నార్ని శ్రీను, కుండ్లమహంతి లక్ష్మీనారాయణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, ఆకుల నవీన్లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కె.గోపాలపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కర్రి కృష్ణ కుటుంబ సభ్యులకు, బొబ్బర కృష్ణార్జునుడు కుటుంబ సభ్యులకు, బొబ్బర మహాలక్ష్మి కుమార్ కుటుంబ సభ్యులకు, జనపరెడ్డి శ్రీను కుటుంబ సభ్యులకు, తాళ్లూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సీలామంతుల వీరబాబు కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.