జనం కోసం జనసేన మహాయజ్ఞం 730వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 730వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 731వ రోజు కార్యక్రమం శనివారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, జగ్గంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్ధిని మరిశే శ్యామల, వెంగయ్యమ్మపురం గ్రామ అధ్యక్షులు కోన నానాజీ, బోండా శ్రీను, మరిశే శ్రీనివాస్, మరిశే నాగేశ్వరరావు, మరిశే బాబ్జీ, సమ్మంగి వీరబాబు, దుడ్డి లోవరాజు, అప్పాన ఫణీంద్ర స్వామి, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జి.వి నాయుడు), యలంశెట్టి వేణు, జగన్నాధపురం నుండి అమరపల్లి రామకృష్ణ, మల్లిశాల నుండి తిర్రి అశోక్, తిరుమలాయపాలెం నుండి కొప్పాక సురేష్, అల్లి తరుణ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, సోమవరం నుండి డేగల నరేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లిశాల గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన వట్టికూటి జనార్ధన్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.