రామగుండం జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్య్ర అమృతోత్సవాలు
రామగుండం నియోజకవర్గం, స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్ ఎ.వి బీను కుమార్ హాజరై జెండా ఆవిష్కరించడం జరిగింది. జనసేన నాయకులు భారత్ జవాన్ బిను కుమార్ ను సత్కరించారు. అనంతరం గోదావరిఖని చౌరస్తా నుండి మేడిపల్లి సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యుత్ అధ్యక్షులు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటి మెంబర్ రావుల సాయికృష్ణ, ఉమ్మడి జిల్లా యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మంథని శ్రావణ్, ఉమ్మడి జిల్లా యుత్ సెక్రెటరీ గోపి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ జూల నవీన్, నియోజకవర్గ నాయకులు తుంగపల్లి కుమార్, ఆదిత్య టిల్లు, రామగుండం మండలం యువజన ప్రధాన కార్యదర్శి గోలి మహేందర్, యువజన ఉపాధ్యక్షులు రవికాంత్, రాజశేఖర్, తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకేష్, పోట్ల శశాంక్, సెక్రెటరీ శరత్ నాయక్, ఎడ్ల లోకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశ్రిత్, రాహుల్, కార్తీక్, సుశాంత్, అవినాష్, మనోజ్ కుమార్, పెగడపల్లి ప్రకాశ్, బూర్ల శ్రవణ్, తంగెళ్ల అరవింద్ మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.