సర్పంచుల హక్కుల పరిరక్షణకై రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో బిజెపి, జనసేనల ధర్నా

మదనపల్లి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో, బీజేపీ పార్టీతో నాయకలతో కలసి గ్రామ పంచాయతీ నిధులు, సర్పంచుల హక్కుల పరిరక్షణకై వైసీపీ ప్రభుత్వంపై ధర్నా కార్యక్రమం రాయచోటిలో ఎస్ ఎన్ కాలనీ నుండి భారీ రాలీతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఈ బటన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినపుడు నుండి 73 రాజ్యంగా చట్ట సవరణ చేసి విచక్షణ విశేషమైన అధికారాన్ని సర్పంచులకి కట్టబెడితే వాటిని అన్నిటిని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులకి విలువ లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా తగిన బుద్ది చెప్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో సనా ఉల్లా, రెడ్డెమ్మ, రాజారెడ్డి, శేఖర, లవన్న, రాజు, రెడ్డి శేఖర్, కటారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.