బండి నరేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి జనసేన ఇంచార్జ్ బండి నరేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి నాయకులు జబీర్ సయ్యద్, నియోజకవర్గ నాయకులు అనిల్ సూరిశెట్టి, వేంసూర్ మండల నాయకులు చెల్లు మణికంఠ, ఆదిత్య అంబటి, సర్నాల శివ, తిరుపతి రాజు, నాగ వెంకట కుమార్, అజీస్, జాన్ పాషా, సాయి రామ్, చందు, నరేష్ పాల్గొన్నారు.