ఉప్ప గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, ఉప్ప గ్రామంలో రాంబాబు సురకత్తి, దుడ్డు శోభన్ బాబు ఆద్వర్యంలో మండల ముఖ్యనాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్య అథిదిగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ హాజరయ్యారు. కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న ధాష్టికాలను ఎండగట్టారు. యువతకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంచాయతీ నిధులు దారి మళ్ళించారు. సరైన మౌళిక సదుపాయాలు లేవని దుయ్యబట్టారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని దీనికి ప్రతి జనసైనికుడు శక్తి వంచనలేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. పధ్నాలుగు మందితో మండల కమిటీ నియమించడమైనది.”గ్రామ -బాట”పేరుతో ప్రతి గ్రామంలో పర్యాటించాలని కమిటీ తీర్మాణించింది. ఆత్మీయసమావేశంలో సింబోయి పరశురాం, మజ్జి క్రిష్ణంరాజు, రాప బుద్దు, జన్ని లింగన్న, జన్ని సతీష్, శరభ ప్రసాద్, ఉబ్బేటి శ్రావణ్ కుమార్, శోభ రాంబాబు దొర, డుంబేరి చిరంజీవి, కిల్లో రమేష్, ఉబ్బేటి లోకేష్ పాల్గొన్నారు.