థెరిస్సా స్ఫూర్తి అనాధ ఆశ్రమంలో ఘనంగా బ్రహ్మాస్త్రం నాగు కుమారుని జన్మదిన వేడుకలు

గాజువాక, జనసేన నాయకులు రేపాక నాగేశ్వరరావు(బ్రహ్మాస్త్రం నాగు) కుమారుడు చిరంజీవి రేపాక వెంకట సాయి పుట్టిన రోజు సందర్భంగా థెరిస్సా స్ఫూర్తి అనాధ ఆశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆశ్రమంలోని పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి చిరంజీవి రేపాక వెంకట సాయి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆశ్రమంలోని పిల్లలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడంతో పాటూ బ్రహ్మాస్త్రం టీమ్ నుండి బ్రహ్మాస్త్రం కిట్లలోని కొన్ని వస్తువులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం నాగు మాట్లడుతూ… సెప్టెంబర్ 2 న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మా బ్రహ్మాస్త్రం టీమ్ నుండి ఇలా బ్రహ్మాస్త్రం కిట్లు ఇవ్వాలి. అయితే ఆ రోజు ఎక్కువగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమయం సరిపోకపోవడంతో బ్రహ్మాస్త్రం కిట్లను అందచేయలేకపోయామని ఏది ఏమైనా కూడా అనాధ పిల్లలందరికీ న్యాయం చెయ్యడం కోసమే బ్రహ్మాస్త్రం నాగు తన బ్రహ్మాస్త్రం టీమ్ ద్వారా ముందుగా 1000 మంది అనాధ పిల్లలకు ఇలా తన బ్రహ్మాస్త్రం కిట్లు ముందుగా ఇవ్వాలి అని దృడ సంకల్పం తో ఒక్క అడుగు ముందుకు వెయ్యడం జరుగుతుందని, నేటితో 300 మంది అనాధ పిల్లలకు ఇలా మా బ్రహ్మాస్త్రం టీమ్ నుండి బ్రహ్మాస్త్రం కిట్లు ఉచితంగానే పంచి పెట్టడం జరిగిందని, నా కుమారుడు చిరంజీవి రేపాక వెంకట సాయి పుట్టిన రోజు సందర్భంగా నేను 15,000 రూపాయలు వస్తువులు ఇలా మన బ్రహ్మాస్త్రం కిట్లు రూపంలో ఇవ్వడం జరిగిందని, అయితే మా కుటుంబ సభ్యులు ఇంకా మా బంధువులు ఇంకా మా 6 టీమ్స్ యొక్క మిత్రుల ఆర్థిక సహాయంతో ఎన్నో అనాధాశ్రమాలకు అండగా ఉంటున్నామని భవిష్యత్తులో మరింత ఎక్కువుగా సేవా కార్యక్రమాలు చెయ్యాలి అనే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.