గుంటూరులో జనంలోకి జనసేన సిద్దాంతాలు

గుంటూరు, ఆర్.ఆగ్రహారం 24వ డివిజన్లో కొన్ని కుటుంబాలని కలసి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కుటుంబాలకి తెలియపరిచడం జరిగింది. మరి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజల దగ్గరకి వెళ్లి ప్రజల్లో లేనిపోని పథకాలన్నీ ఇస్తానని మాయమాటలు చెప్పారు. అవీ అన్నీ ప్రజల్లో ప్రభుత్వ పనితీరు బాలేదు అనిబలంగా వివరించడం చెప్పి రాష్ట్రానికి ఐటీ హబ్బులు, పరిశ్రమలు వస్తే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇవి రాక ఎంతో మంది పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని, పనిచేసుకునే వారికి పనులు లేక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని జనసైనికులు ఇంటింటికి తిరుగుతూ వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు చందు శ్రీనివాస రావు, డి.భార్గవ్ రామ్, తాడికొండ శ్రీనివాసరావు, పెరిగి శెట్టి ఆర్కె. నాయుడు, బాలకృష్ణ, పట్టంశెట్టి రఘు, ఆలా కాసులు, షేక్ రఫీ, రాకేష్, సుభాష్ వెంకట్, ప్రేమ్ చంద్, సాయి రాఘవేంద్ర, దినేష్, పవన్, లక్ష్మిశెట్టి సాయి చంద్ (నానీ) మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.