శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్బంగా కరప మండలం గొర్రిపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సతీసమేతంగా దర్శించుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ దర్శించుకోవడం జరిగింది. అనంతరం కరప మండలం కరప గ్రామం ప్రారంభంలో సిరిపురం గ్రామ వాస్తవ్యులు చిక్కాల దొరబాబు అండ్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన 51 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో స్థానికులు, జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీమతి రాజేశ్వరి, వారి సోదరులు నెలకొల్పిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సతీ సమేతంగా దర్శించుకుని, గ్రామోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. అనంతరం కాకినాడ రూరల్ మండలం, తమ్మవరం గ్రామంలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.