జనసేన ప్రజాబాట మొదట రోజు

శ్రీకాకులం జిల్లా, ఎచ్చర్ల జనసేన ప్రజబాట కార్యక్రమంలో భాగంగా ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ టీమ్ ఆధ్వర్యంలో శనివారం ఎచ్చర్ల మండలం భగీరథపురం గ్రామంలో ఇంటింటికి జనసేన పార్టీ మేనిపెస్టో, షణ్ముఖవ్యూహంతో కూడిన ముఖ్య విషయాలను పొందుపరచిన స్టిక్కర్ను రూపొందించి.. ఇంటియజమాని అనుమతితో ప్రతి ఇంటికి అంటించటం జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశ్యం, సిద్దాంతాలు, మేనిఫెస్టో, షణ్ముఖవ్యూహం అన్నింటినీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలనుండి మొదటిరోజే అశేష స్పందన వచ్చింది. అలాగే ప్రజలు వారికి ఉన్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ చెప్పుకుంటూ.. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, ఎచ్చర్ల మండల నాయకులు తమ్మినేని శ్రీను, రణస్థలం మండలం నాయకులు దన్ననా చిరంజీవి, లావేరు మండల నాయకులు బొంతు విజయకృష్ణ, డి.సంతోష్, దన్నన సంతోష్, హేమసుందర్, గోపి, భగీరథపురం జనసైనికులు రాంబాబు, అనిల్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.