పవర్ లిఫ్టింగ్ విజేత సంకు కృపారావుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మైలవరం:స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కామన్వెల్త్ క్రీడలలో పవర్ లిఫ్టింగ్ విజేత సంకు కృపారావును జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వెంకటాపురం నుండి ర్యాలీగా మైలవరం జనసేనపార్టీ కార్యాలయం వరకు చేరుకొని తదుపరి పార్టీ కార్యాలయంలో కృపారావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ మాట్లాడుతూ జనసైనికుల సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ కృపారావుకి ఉంటాయని అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సైతం ఏపీ శాప్ చైర్మన్ కి లెటర్ రాయడం జరిగిందని, ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కృపారావు మాట్లాడుతూ తనకు సహాయ, సహకారాలు అందజేసిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జి కొండూరు మండల అధ్యక్షులు వై. నరసింహారావు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, మైలవరం మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, జనసేన నాయకులు బత్తిన శ్రీనివాసరావు, భూక్యచిరంజీవి, పసుపులేటి నాగరాజు, ఆనం విజయ్, మాదాసు సుబ్బారావు, కూసుమంచి కిరణ్ కుమార్, పొన్నూరు విజయ్, చంద్రాల మురళీకృష్ణ, సిరియాల వర్మ, చిట్టిమాద వెంకటకృష్ణ, వెంకటస్వామి, ప్రవీణ్, బి.వి.ఎస్.కే.ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావు, సంగు రాంబాబు, జనసైనికులు, వీర మహిళలు, మెయిన్ సెంటర్ యూత్ మరియు కృపారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.