“జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 51 వ రోజు

  • అడుగడుగునా జననీరాజనాలు.
  • హారతులతో ఘనస్వాగతం పలుకుతున్న శ్రీరంగపట్నం గ్రామ మహిళలు.
  • పవన్ రావాలి పాలన మారాలి అంటూ జనసైనికుల కేరింతలు.
  • జనసేన పార్టీపై, మాపై విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణ చూపిస్తున్న ప్రజానీకానికి సర్వదా కృతజ్ఞతలు: బత్తుల

రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”లో భాగంగా కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా గ్రామంలో పలు ఏరియాల్లో పర్యటించారు. ప్రతీ గడప ఎక్కుతూ, స్థానిక ప్రజలతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అధికార వైసిపి చేస్తున్న “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నమ్మేస్థితిలో ప్రజలు లేరని, ఈసారి ప్రజలు ముక్తకంఠంతో జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ రాక్షస ప్రభుత్వాన్ని నుండి విముక్తి పొందాలంటే ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలన్నారు. జనసేన పార్టీపై, మాపై చూపిస్తున్న విశేషమైన అభిమానానికి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేసి రుణం తీర్చుకుంటామన్నారు బత్తుల వెంకటలక్ష్మి. ఈ “మహా పాదయాత్ర”కు మహిళలు పెద్దఎత్తున హారతులు పడుతూ, ఈసారి జనసేన పార్టీకే ఓటు వేస్తామని ముందుకు వస్తూ జనసేన పార్టీకి పెద్దఎత్తున మద్దతు తెలియజేశారు. ఈ “మహాపాదయాత్ర”లో జనసేన నాయకులు, జనసైనికులు, శ్రీరంగంపట్నం గ్రామప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.