తాడికొండలో జగనన్న ఇళ్ళ స్థలాలను పరిశీలించిన గాదె

గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలంలోని లాం గ్రామంలో జగనన్న ఇళ్లను జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ మరియు జిల్లా నాయకులు సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.