జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు

* కొత్తపేట నియోజకవర్గంలో శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం అల్లపల్లివారిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ బండారు వెంకటరాజు ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం శ్రీ వెంకటరాజు కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. మృతికి గల కారణాలు, కుటుంబ స్థితిగతులను ఆరా తీశారు. మృతుని భార్య శ్రీమతి శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
• రావులపాలెంలో ఘన స్వాగతం
అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. శ్రీ మనోహర్ గారిని పూలమాలలతో ముంచెత్తారు. అక్కడి నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ మనోహర్ గారికి స్వాగతం పలికిన వారిలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్, మండపేట ఇంఛార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు శ్రీ మనోహర్ గారు పర్యటిస్తారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేస్తారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.