దళితులకు శ్మశాన వాటిక కేటాయించాలి.. జనసేన వినతి పత్రం

విజయనగరం: మెరకముడిదాంలో నివసిస్తున్న దళితులకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ 23వ తేదీన ముగియడంతో కాల పరిమితి పెంచాలని మెరకముడిదాం మండల ఎమ్.ఆర్.ఓ బత్తిన రత్నకుమార్ కు జనసేన పార్టీ విజనగరం జిల్లా నాయకులు రేగిడి లక్ష్మణరావు మరియు మెరకముడిదాం మండల నాయకులు బంటుపల్లి గౌరి నాయుడు(శంకర్) వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. చనిపోయిన వారిని చెరువు గట్టుపై పూడ్చడం జరుగుతుందని, దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నిస్తూ.. ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అయినా అధికారులు స్పందించడం లేదని ఈ సారి మా సమస్యకు పరిష్కారం చూపించక పోతే కలెక్టర్ రేట్ ను ముట్టడిస్తామని, త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు.