సత్తెమ్మ తల్లి అమ్మ వారి అన్నదానానికి బియ్యం, కందిపప్పు వితరణ

  • ఆలయ కమిటీ సభ్యులకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, విజయదుర్గ దంపతులు

కొండపల్లి మున్సిపాలిటీ: పట్టణ పరిధిలోని శ్రామికనగర్ (కొత్తగేటు)లో కొలువైన శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మ వారి నూతన ఆలయ పునః ప్రతిష్ఠ జనవరి 23వ తేదీన జరగనుంది. అమ్మవారి అన్నదానం కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, విజయదుర్గ దంపతులు సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు 130 కిలోల బియ్యం, 25 కిలోల కందిపప్పును శుక్రవారం అందజేశారు. సత్తెమ్మ తల్లి భక్తులు, ప్రజలందరిని చల్లని దీవెనలతో చూడాలని, భక్తుల కోర్కెలు తీర్చాలని ఆ తల్లి అనుగ్రహం పట్టణ ప్రజలపై ఉండాలని బొలియశెట్టి శ్రీకాంత్, విజయదుర్గ దంపతులు కోరారు.