తిప్పినాయుడు పల్లిలో పర్యటించిన డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, తిప్పి నాయుడు పల్లి గ్రామపంచాయతీ పరిదిలోని తిప్పి నాయుడు పల్లి గ్రామంలో 80 సంవత్సరాల నీలకంఠ పిళ్ళై అనే వృద్ధుడు కి వృద్ధాప్య పింఛన్ రాలేదని న్యూస్ గ్రూప్లో లో సర్కులేట్ అయిన వీడియో పై జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్. యుగంధర్ పొన్న స్పందించి, ఫీల్డ్ వెరిఫికేషన్లో గ్రామాన్ని సందర్శించి అద్వాన పరిస్థితిలో ఉన్న రోడ్లపై స్పందిస్తూ.. తిప్పినాయుడు పల్లిలో సిమెంట్ రోడ్డు వేయాలని, దేవలంపేట నుండి బొమ్మయ్య పల్లి గ్రామానికి రోడ్డు వెయ్యాలని డిమాండ్ చేసి.. ఈ విషయంపై సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ తో మాట్లాడడం జరిగింది.