కాకర్లమూడిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం

పెడన నియోజకవర్గం: పెడన మండలం, పెడన మండలం, కాకర్లమూడి గ్రామంలో గురువారం కాకర్లమూడి గ్రామస్తులతో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్ కృష్ణాజిల్లా కార్యదర్శులు కూనసాని నాగబాబు, పెడన మండల ఉపాధ్యక్షులు చీరల నవీన్ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ , సమ్మెట చిన్ని, బొమ్మిరెడ్డి భగవాన్, ముదినేని రామకృష్ణ, మోహన్ కృష్ణ, కాజా మణికంఠ, ఎండ్రపాటి నాగబాబు, సురేష్ , పులగం శీను, లింగం నరసింహస్వామి, లింగం నాగరాజు, కొత్తపల్లి మారయ్య గారు, గుంటుపల్లి శ్రీనివాసరావు గారు, అర్జా శివాకర్, అర్జ రామ కోటేశ్వరరావు, గుంటుపల్లి రమేష్, లింగం భూలోకచందర్రావు, లింగం ప్రసాదరావు, రావి కోటేశ్వరరావు, మదంశెట్టి వెంకట సుబ్బారావు, లింగం రామాంజనేయులు, కొల్లు చెంచయ్య, మదంశెట్టి శివాజీ, మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా సంగ్రామానికి జనసైనికులను సమయుక్తం చేసే కార్యక్రమంలో భాగంగా పెడన నియోజవర్గ జనసేన నాయకులు వివిధ గ్రామాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాకర్లమూడి గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూనసాని నాగబాబు గారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసైనికులు అందరూ ఒక తాటిపై వచ్చి అభ్యర్థి ఎవరైనాప్పటికీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
తదుపరి ఎస్ వి బాబు మాట్లాడుతూ పెడన నియోజకవర్గం లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని తెలియజేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గం అనేక పోరాటాలు చేశారని, అనేక ప్రజా సమస్యలపై తమ గళాన్ని విప్పారని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అనేక సమస్యలను జనసేన పార్టీ మాత్రమే తీర్చగలుగుతుందని అందువల్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు తోడ్పడాలని తెలియజేశారు.