బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ కి జనసేన వినతి పత్రం

బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో పందులు పిచ్చికుక్కలు కోతులు ఎక్కువయ్యి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉండటం వలన బద్వేల్ టౌన్ కు దూరంగా తీసుకెళ్లి అడవి ప్రాంతంలో వదిలి పెట్టాలని బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ కి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ నాయకులు బసవి రమేష్, బద్వేల్ యూత్ లీడర్ తరుణ్,బద్వేల్ మండల నాయకులు సురేంద్ర, గణేష్ పాల్గొన్నారు.