ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చెయ్యాలి- జనసేన, టిడిపిల వినతి పత్రం

  • ప్రతి ఇంటికి కుళాయిలు వెయ్యమని నర్సిపురం గ్రామ ప్రజలు జనసేన టిడిపి కలిసి కలెక్టర్ కు వినతి

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మండలంలో
నర్సిపురం గ్రామంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటులో అధికారులు రాజకీయ నాయకులు వివక్షత చూపుతున్నారని గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన టిడిపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నర్సిపురం గ్రామంలో కొన్ని వీధులకు ఇంటి కొళాయిలు ఏర్పాటు చేసి మరికొన్ని వీధులకు ఏర్పాటు చేయకపోవడం పట్ల మిగిలిన రాజకీయ పార్టీ సానుభూతిపరులకు మంచినీరు అందించకుండా వివక్షత చూపుతున్నారని తెలిపారు. తక్షణమే అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటింటికీ కొళాయిలు వేయాలని గ్రామస్తులు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ,జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.