అధికార దుర్వినియోగం నశించాలి – ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ఇచ్చాపురం, బెంతు ఒరియా సామాజిక వర్గం పట్ల అధికార దుర్వినియోగం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారుల వల్ల టాలెంట్ ఉన్న బెంతు ఒరియ పిల్లలు ఉన్నత విద్యా చదవలేక పోతున్నారు ఇది దుర్భరకరం అని కులసంఘ పెద్దలు మోహన్ మజ్జి, దుదిస్టి మజ్జి, అర్జున్ మజ్జి ప్రశ్నించారు. కవిటి మండల కేంద్రంలో కొనసాగుతున్న 16 వ రోజు నిరాహార దీక్షలో తిప్పనపుట్టుగ గ్రామస్తులు, యువత, విద్యార్థులు పాల్గొని ఎన్నికల ముందు సిఎం ఇచ్చిన హామీ నెరవేర్చలేనికారణంగా ప్రభుత్వం పథకాలు అందక కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం బెంతు ఒరియా ప్రజలు నష్టపోతున్నము అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంస్రాలు గడిచిన ప్రభుత్వం పట్టిచుకొని తీరును విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూత్ సెక్రెటరీ దుదిస్టి మజ్జి, మోహన్ మజ్జి,దేవు మజ్జి, అర్జున్ మజ్జి, జయసేన్ బిసాయి, బృందావన్ బిసాయి, మేఘనాత్ బిసాయి, గిరి బిసాయి పాల్గొని తమ నిరసన ప్రభుత్వానికి తెలిపారు.