జనసైనికులకు ప్రమాద భీమా చెక్కులు అందజేత

ఎచ్చెర్ల: జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్రియాశీలక సభ్యులకు ప్రమాద భీమా చెక్కులను అందజేసారు. కవిటి మండలంలోని తుంగాన సాగర్, తుంగాన భాస్కర్, బొర్రా షణ్ముఖ రావు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబాలకు గాను ఇచ్ఛాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు సమక్షంలో భీమా చెక్కులు నాదెండ్ల అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం భీమా చెక్కులు అందుకొన్న క్రియాశీలక సభ్యులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న సమయాల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సహాయాన్ని అందించారని ఆయనికి జీవితాంతం రుణపడి ఉంటామని చెక్కులు అందుకున్న వారు తెలిపారు. అలాగే మనోహర్ గారికి, ఇంచార్జ్ దాసరి రాజు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, దుంగు భాస్కర్ రెడ్డి, అంగ సురేష్, తిప్పన సురేష్, బడగల రామకృష్ణ, దుగాన దివాకర్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.