నాసిరకంగా రోడ్డు నిర్మించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బిజెపి, జనసేన ధర్నా

నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ డివిజన్ పప్పుల వీధి నందు అత్యంత నాసిరకంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు దుస్థితిపై గురువారం జనసేన, బిజెపి ఆద్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విధంగా నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్, జనసేన ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టే వెంకటేశ్వర్లు, అశోక్, రమణమూర్తి, శ్రీధర్, కొండయ్య ప్రసన్న, ఫణి రాజు, మస్తానయ్య మారం కృష్ణ, మదన్, జనసేన, బిజెపి కార్యకర్తలు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.