నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ, తిమ్మాపురం మాజీ ఎంపీటీసీ ముద్దన శ్రీనివాస్, శ్రీమతి రాజేశ్వరిలతో పాటు మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ అంతా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.