క్యాన్సర్ బాధితుడికి పరామర్శించిన జనసేన బృందం

  • మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు

అరకు నియోజకవర్గం కేంద్రంలో చిన్నలబుడు పంచాయతీ పరిధిలో గల పకనకుడి గ్రామంలో గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో జనసేన పార్టీ బృందం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించి ముందుగా క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితుడు స్వాబి సోమను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడిని పూర్తి వివరాలు అడగగా తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు జనసేన దృష్టికి పెట్టారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వలన ప్రభుత్వం స్పందించక పోవడం వలన ఏమి చేయలేని ఈ పరిస్థితుల్లో ఇంటికి పరిమితం అవ్వవలసింది వచ్చిందని బాధితుడు తెలిపారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు అల్లంగి రామకృష్ణ, ఎల్బి రవీంద్ర తదితరులు బాధితుడికి భరోసనిస్తూ వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ లో వైద్యం కోసం బాధ్యత తీసుకొని మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.