క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అళహరి సుధాకర్

కావలి జడ్పి బాయ్స్ హైస్కూల్, 11వ వార్డ్ లోని జనసైనికుల ఆహ్వానము మేరకు కృపా సత్య ప్రార్ధన మందిరం చర్చిలో క్రైస్తవ సోదర, సోదరీమణులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ పాల్గొని పాస్టర్ కి రూపాయలు 10000/- నగదు చర్చికోసం ఇవ్వడము జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ ఈ క్రిస్టమస్ శుభదినాన దైవకుమారుడు యేసుక్రీస్తు స్వర్గంలో తన రాజ్యాన్ని విడిచి మన కోసం మానవుడిగా భూమిపై జన్మించారని యేసు జీవితం మానవాళికి అధికార కాంక్ష కాదు త్యాగాన్ని బోధిస్తుందని, ఆ యేసుప్రభు ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమములో కావలి టౌన్ అధ్యక్షుడు పోబ్బా సాయి, 11వార్డ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రభాకర్, మాల్యాద్రి, పవన్ కళ్యాణ్ ఫాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాద్, బెల్లంకొండ మస్తాన్, శరణ్, తిరుమలశెట్టి సుధీర్, కృష్ణయ్య, ప్రవీను, నవీను, శ్రీను, రాజా, సంతోష్, విక్రమ్, మల్లికార్జున్, బాబు, మహేశ్వర, అజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.