జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

బూర్జ మండలం, దోంకల పర్ట్ గ్రామములో.. ఆమదాలవలస నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా.. ప్రజలందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్నటువంటి 30 కోట్ల సహాయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీపతి, నాయుడు, మౌళి, శ్రిను, సంతోష్ నాయుడు, మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియచేయడం జరిగింది.