అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా అళహరి సుధాకర్

కావలి 11వ వార్దు అంబేత్కర్ నగర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కు గురై ఇళ్ళు కాలిపోయిన విషయం స్థానికుల ద్వారా తెలిసుకున్న జనసేన నాయకులతో కలిసి పరామర్శించిన కావలి జనసేన పార్టీ ఇంఛార్జి అళహరి సుధాకర్, ఈ సందర్భగా మాట్లాడుతూ జ్యోతి రమనమ్మ అనే ఆవిడ భర్త, కొడుకు చనిపోయి ఒంటరిగా మనమరాళ్ళతో జీవిస్తున్న ఆవిడ ఇళ్ళు కాలిపోయిన సంగతి మా పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రభాకర(జాన్), పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాథ ద్వారా తెలుసుకొని అంబేత్కర్ నగర్ వచ్చి ఆవిడను పరామర్శించి జనసేన పార్టీ తరుపున 5000/- రూపాయిలు ఆర్థిక సాయం అందించడం జరిగింది అని, ఇళ్ళుకాలి ఇబ్బంది పడుతున్నా ఇంత వరకూ ఈ కుటుంబానికి ప్రభుత్వము తరుపున ఎటువంటి సాయము అందలేదని అవిడ బాధను వ్యక్తపరిచారు అని. వెంటనే ఎమ్మెల్యే స్పందించి వీరికి తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో 11 వార్డ్ ప్రసిడెంట్ జ్యోతి ప్రభాకర, కో-ఆర్డినేటర్ తిరుమలశెట్టి సుధీర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాద్, మస్తాన్, మాల్యాద్రి, కృష్ణయ్య, శ్రీను, చీకటి శ్రీను, ఎమ్మ్. ఆనంద్, సీ.హెచ్. వెంకటేశ్వర్లు, మాధవన్, రాఘవేంద్ర, బాబు తదితరులు పాల్గొన్నారు.