ముద్రగడ పద్మనాభంకు వబ్బిన సన్యాసి నాయుడు బహిరంగ లేఖ


శృంగవరపుకోట, 2004 నుండి నిద్రలో ఉన్న ముద్రగడ ఉప్మా కోసం చేసే డ్రామా దీక్షకు ప్రముఖ సంఘ సేవకులు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వలేదని నిద్ర మత్తులో ఉన్న పద్మనాభం పేర్కొనడం సిగ్గుచేటని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అద్యక్షులు విమర్శించారు. దేశంలో ఎన్టీఆర్, జయలలిత, ఎమ్.జి.ఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషించారు అన్న విషయం తెలియని ముద్రగడ అజ్ఞానానికి నిదర్శనమని సన్యాసి నాయుడు పేర్కొన్నారు. సినిమా రంగం, రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ నిజమైన హీరో అని, ముద్రగడ పద్మనాభం బానిస నుండి కట్టు బానిస గా మారడం ను కూడా హీరోగా పోల్చు కోవడం సిగ్గుచేటన్నారు. గత 40 సంవత్సరాల నుండి దొంగల ముఠాలో ఉన్న నీకు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి ఉన్నదా అని సన్యాసి నాయుడు ప్రశ్నించారు. 30 ఏళ్లు జగన్ సిఎం అని చెప్పే నీకు, 80 అసెంబ్లీ స్థానాలు పవన్ తీసుకోవాలని జగన్ డైరక్షన్ లో యాక్షన్ చేయడానికి ముద్రగడకు సిగ్గులేదు అని నిరూపించుకున్నారని కాపు ఉద్యమ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితం అంతా ఉప్మా కోసం ఉద్యమాలు పేరుతో డ్రామా చేసే వ్యక్తి ముద్రగడ ఒక్కడే అని సన్యాసి నాయుడు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కన్నా వైయస్ రాజశేఖరరెడ్డి గొప్పవాడు అని చెప్పడం ద్వారా ముసుగుదొంగ ముద్రగడ అని రుజువు అయ్యిందని ఆయన అన్నారు. దేశంలో అత్యంత అవినీతి పరుడు వైయస్ రాజశేఖరరెడ్డిని దేవుడుగా పేర్కొనడం వల్ల వైయస్ జగన్ కు నీకు ఉన్న అక్రమ సంబంధం బట్టబయలు అయ్యిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో చీడపురుగు ముద్రగడ అని పేర్కొన్నారు.