ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 35వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, బలిజ పాలెం బిట్ 1 గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 35వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, బలిజ పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి జరగాలన్నా, నిత్యవసర వస్తువుల రేట్లు తగ్గాలన్నా, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసుకు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసుకుందామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతితో పాటూ తాండ్ర శ్రీను పాల్గొన్నాడు.