జనసేన సర్పంచ్ మేడిద సరోజ చేత వైసీపీ నేతలు దౌర్జన్యం గా వైయస్ జగన్ కు పాలాభిషేకం

ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన డ్వాక్రా మహిళలకు సంబంధించి వైయస్సార్ ఆసరా పథకం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు వీర మల్లిబాబు సమక్షంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో డ్వాక్రా మహిళలు అందరిచేత అలాగే వార్డు మెంబర్లు, సర్పంచ్ గారి చేత పాలాభిషేకం చేయించారు కానీ సర్పంచ్ వద్దని వారించినా ఎంపీపీగ పార్టీలతో సంబంధం లేదు సీఎం గారే కదా చెయ్యండి అని సర్పంచ్ ను బలవంతం చేసి నా మీద ఒట్టు అని సర్పంచ్ కు ఇష్టం లేకపోయినా బలవంతంగా పాలాభిషేకం చేయించారు. జనసేన సర్పంచ్ సరోజ మాట్లాడుతూ.. దీనికి మన జనసైనికులు అందరూ క్షమిస్తారని కోరుకుంటూ ఇటువంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ వారి చేత బలవంతంగా ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తూ పార్టీని బలహీనపరచడానికి కుయుక్తులు పన్నుతున్నారు కావున మనమందరం ఇటువంటి వారి వలలో పడకూడదని మనవి చేస్తున్నాను.