ఛలో రణస్థలం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి సిటీ, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈనెల 12వ తారీకున జరగబోవు యువశక్తి సభకు భారీ ఎత్తున తరలిరావాలని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి భారీ బహిరంగ సభ పోస్టర్ను అనుశ్రీ ఆవిష్కరించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో యువత ఆవేదనను బలంగా వినిపించే శక్తిగా ఈ సభ ఉండబోతుందని అనుశ్రీ తెలిపారు. ఈ సభలో యువకులు తమ గళం వినిపించేలా యువకులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని యువతకు భవిష్యత్తు కల్పించే బాధ్యత జనసేనాని పవన్ కళ్యాణ్ యువతకు అండగా ఉంటారని అనుశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాజమండ్రి ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకట పైడిరాజు, కార్యదర్శులు అల్లాటి రాజు, విన్న వాసు, నగర సంయుక్త కార్యదర్శులు దేవికవాడ చక్రాఫణి, కురం అప్పారావు, నగర నాయకులు మంచాల్ సునీలు, పోతుల సురేష్, జనసైనికులు సెశెట్టి ప్రసాద్, విక్టరీ వాసు, బాసరమణి దుర్గాప్రసాద్, కుంది రాము, సియాద్రి రాజు, పళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.