శ్రీవారి సేవలో ఏపీ,కర్ణాటక సీఎంలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్ జగన్ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఇద్దరు సీఎంలకు శ్రీవారి తీర్థప్రసాదాలను టిటిడి ఈవో సింఘాల్, ఛైర్మన్ సుబ్బారెడ్డి అందించారు. అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం వద్ద నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరూ పాల్గొన్నారు.