ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 32వ రోజు

  • త్రాగడానికి నీళ్లు లేక రేణిగుంట పట్టణ ప్రజల ఇక్కట్లు!!
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 32వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణంలో జి. యం. స్ట్రీట్, వినాయక్ నగర్ లో మంగళవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. పట్టణంలో గత నెల రోజులుగా త్రాగు నీరు రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు మహిళలు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పార్థ సారథి, నాగరాజు,నాయకులు భాస్కర్ బాబు, శ్రీనివాసులు, త్యాగరాజు, ఉమామహేశ్వరి, అనురాధ, శ్రీనివాసులు, జ్యోతి కుమార్, వినోద్, జనసైనికులు శంకర్, తిలక్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.