క్యాన్సర్ పేషెంట్ కు ఆర్థిక సహాయం అందజేసిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం కడగట్ల వీడి 32వ వార్డు వాస్తవ్యులు యలమర్తి విజయలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని శ్రీనివాస్ వారి స్వగృహంకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి 10,000 బొలిశెట్టి శ్రీనివాస్ మరియు 10000 కాపు సంక్షేమ సేన సభ్యులు మొత్తంగా 20000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి సురేష్, మాదాసు ఇందు, గుండు మోగుల సురేష్, మద్దాల నరసింహ, రావూరి రమేష్, రావూరి సురేష్, రామిశెట్టి వెంకటేశ్వరరావు, పప్పోపుల త్రినాధ్, బడేటి సత్యనారాయణ, మద్దాల వీరు మరియు తదితరులు పాల్గొన్నారు.