జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ కమిటీలు నియామకం

మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగంతో గ్రేటర్ పరిధిలోని నాయకులకు, గ్రేటర్ కమిటీ సభ్యులకు, వీరమహిళలకు మరియు జనసైనికులకు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మరియు జిల్లాల నుండి వచ్చే జనసైనికులను, వీరమహిళలును మరియు నాయకులను కోఆర్డినేట్ చేయడానికి కమిటీలు నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కావ్య, వైస్ చైర్మన్ నీహారిక నాయుడు, గ్రేటర్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, గ్రేటర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.