గుడిపల్లి జనసేన మండల స్థాయి కార్యవర్గ సమావేశం

కుప్పం: గుడిపల్లి మండల అధ్యక్షులు అమీర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మండల పరిధిలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో సమావేశమైన నాయకులు నియోజకవర్గంలో మండలాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి సంయుక్త కార్యదర్శులు వేణు, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి వామనమూర్తి, మండల కార్యవర్గ సభ్యులు హంసగిరి జాన్, గణేష్, భాస్కర్, మురుగేశ్, నవీన్ రాజేష్, ఆనంద్, జాకీర్, రామచంద్ర, మూర్తి, కుమరేశ్, మణికంఠ, పంచాయితీ కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.