పరుచూరి భాస్కరరావు సమక్షంలో జనసేనలో చేరికలు

అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు సమక్షంలో పిసినికాడ పంచాయతీ వైసీపీ వార్డ్ మెంబర్ బాదపు సింహాచలం జనసేన పార్టీలో చేరారు. అనంతరం రెండు రోజుల క్రితం వైసీపీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు సుదర్శన్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ శ్రీనివాస్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని అతని వైద్యానికి సహకరిస్తానని భాస్కరరావు హామీ ఇచ్చారు. అనంతరం జనసైనికుడి పై దాడి జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసైనికులతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఎవరైనా వేధిస్తే వెంటనే స్వయంగా నాకు తెలియజేయమని చెప్పారు. జనసైనికులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.