వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్బంగా అవనిగడ్డ జనసేన ఘన నివాళి

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ మండలం వంగవీటి మోహన రంగా ఈ పేరు వింటే చాలు కాపు, బడుగు, బలహీన వర్గాలు, బహుజనులు, పేదలు రెండు చేతులు జోడించి ఆరాధన భావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు. మడమ తిప్పని పౌరుషంతో ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం గాంధీయ మార్గంలో అమర నిరాహార దీక్ష ఉద్యమం చేస్తూ 1988 డిసెంబర్ 26న రాజకీయ కుట్రకు బలైపోయారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ మరణించే నాటికి ఆయన వయసు 41 సంవత్సరాలు
ఎంతకాలం జీవించావు అన్నది ముఖ్యం కాదు. ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నది ముఖ్యం. మరణించి 34 సంవత్సరాలు అయినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా చిరస్మరణీయుడు. రంగా ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వ్యాపార నిమిత్తం విజయవాడ చేరుకోవడం జరిగింది. పుట్టింది కాటూరులో అయినా పెరిగింది విజయవాడలోనే. తాను పెరిగిన సమయంలో ఏరోజు రంగ ఊహించి ఉండడు ఇదే నగరానికి తాను శాసనసభ్యులు అవుతానని, పీడిత తాడిత బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేస్తానని వీరమరణం పొందుతానని తన మరణము ఒక ఉద్యమరూపాన్ని సంచరించుకుంటుందని రంగా బాల్యంలో ఊహించి ఉండరు. తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన వంగవీటి మోహన్ రంగా జైలు గోడల మధ్యన నుండి నామినేషన్ వేసి శాసనసభ్యులుగా గెలుపొంది, తెలుగు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.

రంగా ఎదుగుదలను తద్వారా ఓ సామాజిక వర్గం రాజకీయంగా ఎదుగుదలను జీర్ణించుకొని కుటిల వర్గాల కుట్రలకు బలైపోయిన విప్లవ వీరుడు వంగవీటి మోహన రంగా. రంగాని హత్య చేయించడం అంటే ఒక ఒక వ్యక్తినొ సన్మోహ శక్తినొ అంతమొందించడమే కాదు. ఒక బలమైన సామాజిక వ్యవస్థను ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుండి వేరు చేయడమే. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా, ఎన్నో ఆశయాలను మనకు వదిలి వెళ్లారు. రంగ ఆశయాలను నెరవేరే విధంగా యువతి, యువకులు మోహన్ రంగా స్ఫూర్తితో ముందుకు నడిచి, రాజకీయంగా, సామాజిక వర్గంగా ఉద్యమించి, రంగా ఆశయ సాధన కోసం కృషి చేయాలి.ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మోదుముడి వంతెన సెంటర్, మోదుముడి గ్రామంలో, కొత్తపేట గ్రామాల్లో ఉన్నా రంగాగారి విగ్రహలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, బచ్చు నారాయణ, ఎంపీటీసీ సభ్యులు కటికల వసంత కుమార్, బొప్పన భాను, వార్డ్ నంబర్స్ అడపా ప్రభాకర్, కమ్మిలి సాయి, జనసేన పార్టీ నాయకులు బచ్చు రఘునాద్, ప్రసాద్, పప్పుశెట్టి శ్రీనివాసరావు, తుంగల నరేష్, పృథ్వి, తోట ఆంజనేయులు, నాగరాజు, రవి, చందు, మోదుముడి, కొత్తపేట జనసేన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.